ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సమీర్ శర్మ అక్టోబర్ 1న కొత్త సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కో సీఎండీగా పనిచేసిన సమీర్ శర్మ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.