38.2 C
Hyderabad
April 29, 2024 12: 16 PM
Slider నల్గొండ

మహిళలపై అత్యాచారాలకు నిరసనగా బండి ఒక రోజు దీక్ష

#bandi

తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనందుకు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరసిస్తూ రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నేను దీక్ష చేయబోతున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు తదితరులతో కలిసి ఇటీవల మాతృ వియోగంతో బాధపడుతున్న పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అందులోని ముఖ్యాంశాలు ఇవి: నేను  ఏ జిల్లాకు వెళ్లినా పేదలు ఇండ్లు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇయ్యలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేఖ  రాసినా స్పందించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మంది లబ్దిదారులకు ఇండ్లు ఇఛ్చారు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది? అనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడా కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశం చేయకముందే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఎక్కడ చూసినా పగుళ్లు కన్పిస్తున్నాయి. పేదలకు ఒక్క ఇల్లు ఇయ్యని కేసీఆర్ తాను మాత్రం 100 రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నడు. రుణమాఫీ అమలు కాక రైతులు అల్లాడుతున్నరు. రైతుల ఉసురు పోసుకుంటున్నడు. ఈ జిల్లాలో ఐకేపీ సెంటర్లలో పెద్ద కుంభ కోణం జరుగుతున్నా చర్యల్లేవు.

రూ.20 కోట్ల కుంభ కోణం బయటపడింది.  పండించిన ప్రతి గింజ మేమే కొంటామని చెప్పిన కేసీఆర్ ఫ్రభుత్వం … మాట తప్పింది. పండించిన ప్రతి గింజకు పైసలిస్తోంది కేంద్రమే. జిల్లాలో అతిపెద్ద సమస్య ధరణి. అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను ఓపెన్ చేసి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నరు. పేదల భూముల వారి పేర్లపై ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. రుణాలు రావడం లేదు.

ధరణి తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నల్లా ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిస్తున్నడు. సిగ్గు లేకుండా గ్యాస్ ధరల పెంపుపై ధర్నాలు చేస్తున్నరు. మద్యం ధరలను కూడా భారీగా పెంచి ఏటా రూ.40 వేల కోట్లు దోచుకుంటున్నడు అంటూ బండి సంజయ్ ఆరోపించారు.

Related posts

కోవిడ్ నిబంధనల మేరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం

Satyam NEWS

కువైట్, ఖతార్ లో మాస్క్ లేకపోతే మూడు నెలల జైలు

Satyam NEWS

తాగి నడపడం వల్లే మర్రిమిట్ట రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment