బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో పలు బ్రాంచీల్లో పనిచేసిన దివ్యవాణి ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.