నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు నేడు భక్తులు బారులు తీరారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు.
కోవిడ్ 19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు.
ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలను అర్చకులు నిర్వహిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.