కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా నిజాంసాగర్ లో కామారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దఫేదర్ శోభా,జుక్కల్లో జడ్పీటీసీ లక్ష్మీ బాయి మద్నూర్లో జడ్పిటిసి అనిత ,
పెద్దకొడప్గల్లో జడ్పిటిసి చంద్రభాగ ,పిట్లంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి బిచ్కుందలో జడ్పిటిసి భారతి ,తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఆయా మండలాల ఎంపీపీలు ఎంపీటీసీలు తమ ఓటును వినియోగించుకున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఈ పోలింగ్లో పాల్గొన్నారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అటు అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ దఫేదర్ శోభా మాట్లాడుతూ ఎమ్మెల్సీగా కవిత విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు .