సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. మిడ్జిల్ పట్టణంలో శనివారం 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను కలుపుకొని 75 అంగుళాల బతుకమ్మను పేర్చి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సెయింట్ మేరీస్ పాఠశాల బాలికలతో వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలు నిర్వహించే కారణాలను విద్యార్థులతోపాటు జన సమూహానికి వివరణ ఇస్తూ 1947 క్షణాలు నిడివి గల పాటకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్, ఉపాధ్యాయులుఏ రవికుమార్ లింగ అరుణ సుకుమార్ హేమలత దుర్గ భవాని తదితరులు పాల్గొన్నారు.
previous post
next post