పేదింటి ఆడపడుచులు కూడా ఆనందంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని హైదరాబాద్ జుబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఆయన నేడు రహమత్ నగర్ డివిజన్ లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంతోషం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు లియాకత్ అలీ, సిఎన్ రెడ్డి,వార్డ్ మెంబర్లు, ఏరియా మయసభా మెంబర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.