గుంటూరు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డ్ లో నేడు శనగల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ -క్రాప్ విధానం లో లోటు పాట్లు, రైతులు పాటించాల్సిన విధి విధానాలు,అధికారుల ద్వారా వారికి పూర్తి సహకారం అందేలా సూచనలు చేశారు.
వైస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతుకు నష్టం కలిగించే పని ఎన్నటికీ ఈ ప్రభుత్వం చేయబోదని తెలియజేసారు. నరసరావుపేట కు సంబంధించి 1600 హెక్టార్లలో సాగుభూమి ఈ-క్రాప్ లో నమోదు చేశారు. ప్రస్తుతం బయట మార్కెట్ లో క్వింటాల్ సెనగల ధర రూ.3500 ఉండగా ఈ రైతు పక్షపాత ప్రభుత్వం రూ.4875 లకు కొనుగోలు చేస్తుంది.
కందులు క్వింటాలు ధర రూ.4800 ఉండగా ప్రభుత్వం రూ.5800 లకు కొనుగోలు చేస్తుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ S. A. హనీఫ్, gdcc బ్యాంక్ చైర్మన్ వట్టికుంట అంజయ్య, మార్కెట్ A. D. మస్తానమ్మ, పిల్లి ఓబుల్ రెడ్డి, పచ్చవ రవీంద్ర పాల్గొన్నారు.