విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి, గత మాసంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసినందుకు, పోయిన ఆస్తులను రికవరీ చేసినందుకు, గంజాయి అక్రమ రవాణను నియంత్రించినందుకుగాను ఎస్.కోట సిఐ ఎస్. సింహాద్రి నాయుడు, రాజాం సిఐ హెచ్.ఉపేంద్రరావు, రాజాం పట్టణ సిఐ కే. రవికుమార్, రాజాం ఎస్ఐ వై.రవి కిరణ్, వంగర ఎస్ఐ ఆర్.జనార్ధనరావు, ఎస్. కోట ఎస్ఐ జె. తారకేశ్వరరావు, కొత్తవలస ఎస్ఐ బి. దేవి మరియు వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తూ, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను ప్రదానం చేసారు.
ఈ సమీక్షా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ డిఎస్పీ డి.విశ్వనాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, డిపిఓ ఎఓ వెంకట రమణ, సిఐలు జి. రాంబాబు, ఈ. నర్సింహమూర్తి, జె. మురళి, రాజశేఖర్, బి. వెంకటరావు, సిహెచ్. లక్ష్మణ రావు, టి.వి.తిరుపతిరావు, ఎస్. బాల సూర్యారావు, బి. నాగేశ్వరరావు, విజయనాధ్, ఎం. నాగేశ్వరరావు, ఎస్. తిరుమల రావు, జి.సంజీవరావు, హెచ్.ఉపేంద్రరావు, ఎస్. సింహాద్రి నాయుడు, ఎం. బుచ్చిరాజు, ఎల్. అప్పలనాయుడు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.