కలెక్టరేట్ వద్ద వీహెచ్.పీ ,భజగరంగ్ దళ్,హిందూ సేవా సమితి సంయుక్తంగా ధర్నా…!
విజయనగరం జిల్లా కేంద్రంలో అదీ కలెక్టరేట్ వద్ద ఓ వైపు 117 జీఓ ను రద్దు చేయాలంటూ టీచర్లు ధర్నా చేస్తూఉంటే మరోవైపు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా వీహెచ్పీ, భజరంగ్ దళ్, హిందూ సేవా సమితిలు అదే కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు..
దేశంలో ఓ జకీర్ నాయక్ లాంటి వాళ్లు తమ కుహనా లౌకిక వాదం కోసం… ఇష్టొచ్చిమాట్లాడుతుంటే నోరు మెదపని ప్రజలు…మన దేవుళ్లను అసభ్యమైన పదాలతో దూషించిన వారికి సరైన సమాధానం చెప్పిన నుపుర్ శర్మ ..సరైనరీతిలో సమాధానం చెప్పడంలో తప్పేముందని హిందూ సంఘాలు గళమెత్తాయి.ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నినాదాలు చేసిన ఆసంఘాలు అనంతరం..జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావును కలిసారు…
హిందూ దేవుళ్లను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వినతి పత్రం సమర్పించాయి…వీహెచ్.సీ, భజగరంగ్ దళ్,హిందూ సేవా సమితులు. మన దేవుళ్లను అసభ్యకరమైన పదాలతో దూషించిన వారికి వారి పద్దతిలోనే సమాధానమిచ్చిన హిందూ శివాంగి నుపుర్ శర్మ అని…ఆమెక మద్దతుగా యావత్ హిందూ సమాజం నిలవాలంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్ అధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వంచారు..ఆయా సంస్తల ప్రతినిధులు.
ఒక స్త్రీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఆవిషయాన్ని కప్పిపుచ్చడానికి దేశ,విదేశాలలో వున్న శాంతి కామకులు అశాంతికి గురైయ్యారని.. ప్రపంచ దేశాల ముందు భారత దేశాన్ని ఒక దోఫి గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేసాయి..ఇక: దేశంలో ఉన్న వాళ్లు దేశాన్ని ఏమైనా అనొచ్చు ఎందుకంటె వాక్ స్వాతంత్రం. దాన్ని కండిస్తే మాత్రం మత తత్వం అని వ్యాఖ్యలు చేయడం మన దౌర్భాగ్యమని వీహెచ్పీ పేర్కొంది.