గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి www.ganapathideva.org వెబ్సైట్ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఖైరతాబాద్ గణపతి ఈ సారి ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు.
కొవిడ్ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు.
చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదు.