టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, టి ఎస్ ఐ టి శాఖ మంత్రి కె టి ఆర్ ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో నిరసన దీక్షలు చేయాలని బి జె పి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ లో బిజెపి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ , రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారి శ్రీవాణి వెంకటరావు లు దీక్షను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ,టి ఎస్ ఐ టి శాఖ మంత్రి కె . తారక రామారావును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు కక్కిరేణి హరీష్ , బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్ , సుమన్ రావు,సోమశేఖర్ గౌడ్, రఘుపతి గౌడ్,ఎల్లా చారి, లక్ష్మి,గీత,శాంతి కుమార్, పూల కృష్ణ, వెంకన్న, సురేష్, భాస్కర్, ఉప్పల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా