‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాకు కూకట్పల్లి నుండి బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో 100 కార్లలో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు మహా ధర్నాకు కూకట్పల్లి నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కూకట్పల్లి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి ఇన్చార్జి మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు లు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని మన తెలంగాణ మనకొస్తే మన ఉద్యోగాలు మనకే వస్తయని కొన్నేండ్ల నుంచి తెలంగాణ యువత, నిరుద్యోగులు ఎదురుచూస్తు వచ్చారన్నారు. తెలంగాణ వచ్చినంక ఎనిమేందడ్లకు గానీ గ్రూప్ 1 నొటిఫికేషన్ వేయలేకపోవడం విచారకరమన్నారు. ఈ ఎనిమిదేండ్ల నుంచి లక్షల మంది సర్కారు కొలువుల నోటిఫికేషన్ల కోసం చూసి చూసి విసిగిపోతున్నారని ఆయన అన్నారు.
previous post
next post