హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూసీ నదిని పరిశీలించడానికి అలాగే భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లు, రహదారులు, కలుషిత నీరు సమస్యలను తెలుసుకుని ప్రజలకు భరోసా ఇవ్వటానికి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు గోల్నాక డివిజన్ అంబేద్కర్ నగర్, దుర్గానగర్ తదితర బస్తీలలో పర్యటించారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూసారాం బాగ్ బ్రిడ్జిని తనిఖీకి వచ్చినప్పటికీ జిహెచ్ఎంసి సిబ్బంది మూసినది బ్రిడ్జి దగ్గర చెత్తను తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. హిమాయత్ సాగర్ గేట్లు తెరవటం వల్ల వరద పెరిగితే పరిసరాలలో ఉన్న బస్తీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి వెంటనే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బిజెపి గోల్నాక డివిజన్ కన్వీనర్ రవీందర్ గౌడ్ మూల, నర్సింగరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్