కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను జనావాసాలకు తీసుకువెళ్లాళని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్ లో ప్రజా గోస బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూగడచిన 9 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం గానీ ఎమ్మెల్యే గానీ ప్రజలకు చేసిందేమీ లేదని, ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు, భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా ఆయుష్మాన్ భారత్, ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన ,ఆవాస్ యోజన, అటల్ పెన్షన్ యోజన ఇలా ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీస్కెళ్ళాలని బీజేపి నాయకులకు పిలుపిచ్చారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర రావు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ ,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవెర్దన్ గౌడ్,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్,రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ ,రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విట్టల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ , ఆర్ వెంకటేష్ , దయాకర్ ,సీనియర్ నాయకులు స్వామి గౌడ్, సంజీవ్, దినేష్ యాదవ్, విశ్వనాథ,మురళి, బాలు, రాఘవేంద్ర, జగదీష్ రెడ్డి, మరియుటెలికాంనగర్ కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు