40.2 C
Hyderabad
April 26, 2024 14: 34 PM
Slider కర్నూలు

నిరుద్యోగ పట్టభద్రులు ఓటింగ్ కు రాకుండా వైసీపీ కుట్ర

#bjpap

నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడం కోసం ఎన్నికల రోజునే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీకి ఉన్న ఓటమి భయాన్ని ఈ చర్య తెలియ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ను తక్షణమే వెనక్కి తీసుకొని, పట్టభద్రులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

తెలంగాణలో జనవరి నుండి పాఠశాలలను ప్రారంభించాలి

Satyam NEWS

అంబర్ పేట్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి

Bhavani

లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వాహనానికి ప్రమాదం

Satyam NEWS

Leave a Comment