బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధికీని నేడు మైనారిటీ మోర్చా జాతీయ నాయకుడు షేక్ రహ్మతుల్లా కలిశారు. దేశంలో ముస్లిం లు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు.
కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన రోజువారీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని అందరికి అందే విధంగా చూడాలని వారు నిర్ణయించారు.
జమాల్ సిద్ధికీని కలిసిన వారిలో షేక్ రహ్మతుల్లా తో బాటు వక్ఫ్ బోర్డు సభ్యుడు హనీఫ్ అలీ, తెలంగాణ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అఫ్సర్ పాషా తదితరులు కూడా ఉన్నారు.