సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బా భాగ్యరెడ్డి, సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో బలపరిచేందుకు, ప్రతి బూతులో క్రియాశీల సభ్యత్వాలను అనుబంధంగా సాధారణ సభ్యత్వం నమోదు చేయాలని, ఆయా బూతులకు సంబంధించిన ప్రజా అధిపతులను కోరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సేవా సంఘ్ అనే నినాదంతో ప్రజలకు సేవ చేస్తూ వారికి దగ్గరవ్వాలని అన్నారు. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భయంకరంగా మారి విజృంభిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రాణాలు గురించి పట్టించుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం విషయంలో విఫలమైందని, తెలంగాణ ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి, బాల వెంకటేశ్వర్లు, నర్సింగ్ సతీష్ గౌడ్, దేమనకొండ రామరాజు, కోటిరెడ్డి , వల్లపుదాసు గోపి గౌడ్, వివిధ మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.