శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామపంచాయతీ పరిధిలో గల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, తంగి వాణి పేట ప్రాథమికోన్నత పాఠశాల, గాంధీ నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ సచివాలయంలో కరోనా పరీక్షలు నిర్వహించారు.
సింగుపురం పి హెచ్ సి సెంటర్ వారు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్, ఎం .హేమలత, లక్ష్మి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాస రావు, చిన్నమ్మడు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.