పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల పై దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు అంబర్ పేట్ శ్రీరమణ చౌరస్తా లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ అధ్యక్షులు బి.వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల ఇండ్ల పై, కార్యకర్తల పైన దాడులు చేసి కార్యకర్తలను భయబ్రాంతులు చేయడం మమతా బెనర్జీ సర్కారు నీచ రాజాకీయాలకు పరాకాష్టని అన్నారు.
నిరసన కార్యక్రమం లో బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ అధ్యక్షులు బి. వెంకట్ రెడ్డి,
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, బాగ్ అంబర్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కోడూరి సురేష్ కుమార్, డివిజన్ బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బాల కృష్ణ గౌడ్, ముఖేశ్ గౌడ్, శివ మూర్తి, సాయి, శశికాంత్ పాల్గొన్నారు.