అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే నెపంతో దాడి చేసిన టీఆర్ఎస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని బిజెపి నేతలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా SP, DSP ఆఫీస్ ముందు బిజెపి నేతలు ధర్నా కు దిగిడంతో ఉద్రికత్తత చెలరేగింది.
ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే కక్షతో BJYM జిల్లా మీడియా కన్వీనర్ విజయభాస్కర్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. దాడి చేసి వారం రోజులు గడుస్తున్నా దాడికి పాల్పడ్డ గుండాలను అరెస్టు చేయకపోవడంపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
TRS గుండాలు గత వారం క్రితం దాడి చేసి అతనితో పాటు వారి కుటుంబ సభ్యులను గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బిజెపి నేతలు తక్షణమే పోలీసులకు తెలిపారు. అయినా ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు కూడా చేయలేదు.
దాంతో బిజెపి నేతలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూల్ బిజెపి ఇంచార్జి దిలీపాచారి డిమాండ్ చేశారు.
వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ టీఆర్ఎస్ గుండాలపై చర్యలు తీసుకోకుండా పోలీసులు జాప్యం చేయడాన్ని వారు ప్రశ్నించారు. దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలనీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ కార్యకర్తలతో కలిసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, వివిధ మోర్చ, మండల నాయకులు పాల్గొన్నారు.