బీజేపీ కార్యకర్తలు గ్రామాలలో చురుకుగా పనిచేసి గ్రామ సమస్యలు పార్టీ దృష్టికి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు బండ్ల పద్మావతి అన్నారు.
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల బీజేపీ పార్టీ మండల కార్యవర్గ సమావేశం బుధవారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, జాతియ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు జరగగామండల కార్యవర్గ సబ్యలు, సర్పంచ్ లు,ఎంపీటీసీలు, మండల బీజేపీ నాయకులు,అన్ని మోర్చాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి లు,బూత్ కమిటీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.
బీజేపీ మల్దకల్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ మహిళా ఉపాద్యక్షురాలు బండల పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలోని సమస్యలను పార్టీ దృష్టికి తీసుకు వస్తే డికె అరుణ నేతృత్వంలో జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను, మెడికల్ కాలేజీ ఏర్పాటు తదితర అంశాలను కార్యకర్తలు, నాయకులు పార్టీ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బండల పద్మావతిని ఘనంగా సన్మానం చేశారు.
ఈ సమావేశంలోజిల్లా కిసాన్ అధ్యక్షుడు రాముడు,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నర్సింలు నాయక్,ఎంపీటీసీ లక్మన్న,మాజీ సర్పంచ్ దామనాగరాజు,దామ వెంకటేష్,మురళీదర్ రెడ్డి,ఎస్సి సెల్ అధ్యక్షుడు కిషోర్,వెంకటేశ్ రెడ్డి, సత్యరెడ్డి,పోలీసు తిమ్మప్ప, వాసు రెడ్డి,కృష్ణా రెడ్డి, జయారముడు, మహేష్,అనిల్,తిరుపతి రెడ్డి,గోవిందు,సంతోష్,జంగం రాజశేఖర్,మాజి ఎంపీటీసీ రాముడు, వెంకట్రామిరెడ్డి,యూత్ అధ్యక్షుడు లక్మి నారాయణ, టౌన్ అధ్యక్షుడు ఎంకే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.