ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ కి డీఐజీ గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచీ ఉత్తర్వులు వచ్చాయి.
ఈ పరిషత్ ఎన్నికల అనంతరం ఎస్పీ కి పదోన్నతి తో పాటు బదిలీ కూడా అవుతారని సమాచారం. తాజాగా పరిషత్ ఎన్నికలలో తెల్లవారుజామున నుంచీ జిల్లా లో ముఖ్యమైన అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నిర్వహిస్తున్న సిబ్బంది ని అలాగే పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
పొద్దున్నే బొండపల్లి వెళ్లిన..ఎస్పీ..గజపతినగరం లో పర్యటించారు. పటిష్ట బందోబస్తు మధ్య.. ఆక్టోపస్ సిబ్బంది తో ఏకే47 వెపన్ లు పట్టుకున్న..నలుగురు సిబ్బంది భద్రతా వలయంతో..ఎస్పీ రాజకుమారీ పోలింగ్ సరళిని పరిశీస్తున్నారు.
తాజాగా జిల్లాలో బొండపల్లి హై స్కూల్లో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లును విజయనగరం జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు.