కామినేని హాస్పిటల్ ఐసి యు లో చికిత్స పొందుతున్న నాచారం కు చెందిన నిఖిల్ సాయిని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మా రెడ్డి పరామర్శించారు. నాచారం కు చెందిన నిఖిల్ సాయి గత కొద్ది కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న నిఖిల్ సాయికి మెరుగైన చికిత్స కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు తో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడి మెరుగైన చికిత్స అందే టట్లుగా ఏర్పాట్లు చేయించారు. అనారోగ్యంగా బాధపడుతున్న నిఖిల్ సాయికి తమ వంతు సహాయాన్ని బిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని వారి కుటుంబ సభ్యులకు బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి