ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సుమారు 35 మంది పడవలో సుమ్లీ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని వారంతా నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. వారంతా చిన్నపిల్లలే. కొంతమంది ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. మరికొంత మంది నదిలో మునిగిపోయారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ప్రమాదం జరగటం మూడవసారి.
previous post
next post