ఇటీవల అనారోగ్యంతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్నిఅందచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్. పి కె.కె.ఎన్ అన్బురాజన్ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు విచారించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పి.రవి చంద్ర(HC 1922) తండ్రి స్వామి దాస్ కు, ఎ. శ్రీకాంత్ (PC 2890) సతీమణి రూత్ ప్రశాంతి, హోమ్ గార్డు ఎం.నాగరాజు(HG446) సతీమణి లక్ష్మి దేవికి, ఎస్.సుబ్రహ్మణ్యం (HG13) సతీమణి రమాక్రాంతికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందచేశారు.
అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించడం బాధాకరమని ఎస్పీ పేర్కొన్నారు. కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు వితరణ నిధి నుండి ఈ మొత్తాన్నిఅందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఖాసిం సాహెబ్, ఏ.ఓ డి.వెంకటేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు దూలం సురేష్,ఉపాధ్యక్షులు ఉప్పు శంకర్, కో-ఆప్షన్ సభ్యులు బండారు రామకృష్ణ, ట్రెజరర్ గంగరాజు పాల్గొన్నారు.