28.7 C
Hyderabad
April 27, 2024 04: 39 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఏపి సిఎం ఇంటి ప్రాంతంలో పేలుడు

bomb explossion

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివశిస్తున్న ప్రాంతంలో కొద్ది సేపటి కిందట పేలుడు శబ్దాలు వినిపించడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణానగర్ బొగ్గిళ్ళు కాలనీలో ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో18 ఏళ్ల పింకీ అనే యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఇంట్లో ఉల్లి పాయ బాంబులు తయారు చేస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. 100 ఉల్లి పాయ బాంబులు చుడితే, 40 రూపాయల వస్తాయనే ఆశతో బాంబులు చుడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆ ఇంట్లో నిలవ ఉంచిన ఉల్లి పాయ బాంబులు పేలినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,ఆధారాలు సేకరిస్తున్నారు.

Related posts

రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర

Satyam NEWS

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

Satyam NEWS

పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment