ఇటీవల టిఆర్ఎస్ ను వీడి బిజేపి లో చేరిన భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ బిజేపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భాజపా ఉద్యమ పార్టీ అయితే తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. యెక్కువ మంది తెరాసను ఎందుకు వీడుతున్నారో ప్రజలు గ్రహించాలని సూచించారు. ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను తెరాసను వీడామని చెప్పారు. టిఆర్ఎస్ కు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
previous post