33.7 C
Hyderabad
April 28, 2024 00: 15 AM
Slider హైదరాబాద్

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డ మాజీ ఎంపీ  బూర నరసయ్య గౌడ్

#boora

ఇటీవల టి‌ఆర్‌ఎస్ ను వీడి బి‌జే‌పి లో చేరిన భువనగిరి మాజీ ఎం‌పి బూర నర్సయ్య గౌడ్ టి‌ఆర్‌ఎస్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ బి‌జే‌పి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ  భాజపా ఉద్యమ పార్టీ అయితే తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని  ఆరోపించారు.  ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. యెక్కువ మంది తెరాసను ఎందుకు వీడుతున్నారో ప్రజలు గ్రహించాలని సూచించారు. ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తాను తెరాసను వీడామని చెప్పారు. టి‌ఆర్‌ఎస్ కు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Related posts

తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య ను పెంచడం హర్షణీయం

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమమే జెఎస్ఎస్ ధ్యేయం

Satyam NEWS

మరోసారి వాయిదాపడనున్న ఇంటర్‌ పరీక్షలు

Sub Editor 2

Leave a Comment