ఓ సామాన్యుడు ..ఓ టీ కొట్టు…పెట్టుకున్న వ్యక్తి… ఉపయోగించే గూగుల్ పే ని జగన్ ప్రభుత్వం… లిక్కర్ వద్ద ఎందుకు వినియోగించటం లేదని… టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.’ఇదేం ఖర్మరా బాబూ” అన్న కార్యక్రమంలో భాగంగా విజయనగరం 46వ డివిజన్ కనపాకలో పార్టీ శ్రేణులతో ఆయన పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారి ఇంట్లో పూజలు ఉండటం వల్లన…ఆయన నిర్దేశించిన డివిజన్ లో ఈ కార్యక్రమం తలపెట్టామన్పారు.లి క్కర్ ద్వారా జగన్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ను అక్రమంగా సంపాదిస్తోందని…ప్రతీ చోట వినియోగించే డిజిటల్ టెక్నాలజీ… అక్కడ ఎందుకు ఉపయోగించటం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన దాదాపు నాలుగేళ్ళ పూర్తవుతున్ళదే గాని…. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నగర నేతలు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్… కంది మురళీ నాయుడు.. తదితరులు పాల్గొన్నారు.