బిఆర్ఎస్ పార్టీ పాలకుల వైఫల్యాలను గిరిజన తండాల లో విస్తృతంగా తీసుకువెళ్ళి హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించటానికి అహర్నిశలు కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అద్యక్షుడు తేజావత్ సైదులు నాయక్ కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు తేజవత్ సైదులు నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల ఎస్టీ సెల్ అధ్యక్షులు,ఇతర బాధ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తేజావత్ సైదులు నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు,ముఖ్యమంత్రి గడిచిన తొమ్మిది ఏళ్లలో గిరిజనులకి ఎలాంటి హామీ నెరవేర్చలేదని అన్నారు.
ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పిస్తానని మోసం చేయడం,గిరిజన బంధు ద్వారా ప్రతి గిరిజనుడికి 10 లక్షల రూపాయలు ఇస్తానని మాట తప్పడం,భూమి లేని గిరిజనులకి మూడు ఎకరాలు భూమి ఇస్తానని మాట తప్పడం,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మరల్చి కమిషన్ల కోసం మిగతా ప్రాజెక్టులు కట్టడం,తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామపంచాయతీలో మార్చకపోవడం, హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాగు చేసుకుంటున్నా నిరుపేదల గిరిజన భూములను కబ్జాలు చేసుకుని రౌడీ మూకలతో వారిని కొట్టించి,బెదిరించి కేసులు పెట్టించి వారి భూములు లాక్కోవడం,గత తొమ్మిదేళ్లలో నిరుపేదలైన గిరిజనులకి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, స్థానిక ఎమ్మెల్యే తన స్వలాభం కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టటం, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న గిరిజన వార్డ్ సభ్యుల నుండి సర్పంచ్, ఎంపీటీసీలు,జడ్పిటిసి,ఎంపీపీ,ఇతర ప్రజాప్రతినిధులను వారి అధికారాలను,వారి విధులను వారు చేసుకోకుండా నిర్వియం చేసి అంతా తానే అంటూ,అంతా తన ఇష్టం అంటూ పాలన చేసి గిరిజనులను అవమానపరిచిన స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండ కట్టేందుకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న గిరిజన ఎంపీపీ గోపాల్ నాయక్,జడ్పిటిసి మోతిలాల్ నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు మంజు నాయక్,మాజీ ఎంపీపీ జామ చోక్ల నాయక్, ఇతర ప్రజాప్రతినిధుల సహకారాలతో హుజూర్ నగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్,అన్ని మండలాల ఎస్టీ సెల్ కమిటీలతో ప్రతి తండాను విస్తృతంగా ప్రచారం చేసి,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రజలలో తీసుకువెళ్ళి హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించటానికి కాంగ్రెస్ పార్టీ గిరిజనులు అందరూ కృషి చేయాలని తేజావత్ సైదులు నాయక్ కోరారు.
ఈ సమావేశంలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన బానోతు వినయ్ తండ్రి వెంకన్నకు ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు గా నియమించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తేజవత్ రవి నాయక్,సర్పంచ్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీటీసీ బానోత్ రాములు నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేతావత్ మధు నాయక్,గరిడేపల్లి మండల ఎస్టి సెల్ అధ్యక్షుడు బానోతు శివ నాయక్, చింతలపాలెం మండల ఎస్ టి సెల్ అధ్యక్షుడు శ్రీను నాయక్,పాలకీడు మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు సందీప్ నాయక్ బంజారా నాయకులు రామ్ లక్ష్మణ్ నాయక్,పానుగోతు శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్