36.2 C
Hyderabad
April 27, 2024 22: 23 PM
Slider ఖమ్మం

భూమి పుత్రుడుకు బూతు పురాణంకు మధ్య పోటీ

#puvvada

ఖమ్మం నగరంను తన ఇల్లులా భావిస్తున్నానని, తాను ఇక్కడి భూమి పుత్రుడనని, ఇక్కడ భూమి పుత్రుడికి, బూతు పురాణంకు మధ్య పోటీ జరిగుతుందని ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.ఖమ్మంకు తాను భూమి పుత్రుడినని, ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగినానని, ఇక్కడి ప్రజలoదరి మధ్యనే తిరిగినానని, ఇక్కడే ప్రజాసేవలో ఉన్నానని అన్నారు. ఖమ్మం నగరంలో ప్రజల సంక్షేమం కోసం అనేక పనులు చేశామని, ఇంకా చాలా చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని, ఒక పెద్ద మనిషి ఇక్కడ అవాకులు చవాకులు పేలుతున్నారని ద్వజమెత్తారు.
ఒక పెద్ద మనిషి పెద్దరికoగా వ్యవహరించాల్సిందిపోయి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, అలాంటి వాళ్లకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

కుక్కల దాడిలో జింక మృతి

Bhavani

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం

Bhavani

కరోనా కాటు ఒకవైపు నిత్యావసరాలు ధరల పెరుగుదల మరోవైపు

Satyam NEWS

Leave a Comment