40.2 C
Hyderabad
April 29, 2024 16: 56 PM
Slider జాతీయం

ప్రేమ నిరాకరించిందని క్రూరంగా చంపేసిన ప్రేమికుడు

#lover

తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే కోపంతో ఒక శాడిస్టు ప్రేమికుడు ఆ అమ్మాయిని హత్య చేసి మృతదేహం తీసుకుని పరారయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో ఈ క్రూరమైన ఘటన జరిగింది. హోషియార్‌పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి శీతల్ అక్కడి శర్మ మార్కెట్‌లోని ఒక బీమా కంపెనీలో పనిచేసేది. ఆమెను గౌరవ్ అనే యువకుడు వెంటపడి వేధించేవాడు.

నిందితుడిపై సెప్టెంబర్ 29న సెక్టార్-49 పోలీస్ స్టేషన్‌లో ఆ యువతి కేసు కూడా పెట్టింది. దీని ఆధారంగానే పోలీసులు గౌరవ్‌ను జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అతడిలో మరింత కసి పెరిగింది. మళ్లీ ఆ అమ్మాయి వద్దకు వెళ్లి తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంతే కాదు తామిద్దరం 2 సంవత్సరాల క్రితం ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీసులో పనిచేసేవాళ్లమని గౌరవ్ చెప్పాడు.

అక్కడ వరుసగా ఐదేళ్లు కలిసి పనిచేశాం. ఇద్దరూ కలిసి లివ్‌ఇన్‌లో ఉండేవారం అని కూడా చెప్పాడు. గతంలో ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. ఆ యువతి నిందితుడితో నెలల తరబడి మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో ఆ యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. 22 ఏళ్ల ఆ యువతిని మూడో అంతస్తు నుంచి తోసి మృతదేహంతో యువకుడు పరారయ్యాడు.

మృతదేహంతో పాటు ఘజియాబాద్ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఆ మృతదేహాన్ని బిజ్నోర్‌లో కాల్చివేయాలని ప్లాన్ చేశాడు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారని ఏడీసీపీ అశుతోష్ ద్వివేది తెలిపారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై 302, 201, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Related posts

దాసుకి ఊస్టింగ్… ప్రసాదుకి పోస్టింగ్

Satyam NEWS

వెనుకబడిన ఆదిలాబాద్ లో జాతీయ రహదారి

Satyam NEWS

చైత్రోదయం

Satyam NEWS

Leave a Comment