29.7 C
Hyderabad
April 29, 2024 08: 41 AM
Slider జాతీయం

ఫైండింగ్ నిర్మల:ఆర్థికశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశమా ?

budget meeting

‘‘ఆర్థికశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశం నిర్వహిస్తారా.? కనీసం వచ్చే సమావేశానికైనా ఆర్థిక మంత్రిని ఆహ్వానించే విషయంపై ఆలోచించండి’’ అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నరేంద్రమోడీ సర్కార్ పై ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పించింది. గురువారం దిల్లీలో నిర్వహించిన ముందస్తు బడ్జెట్‌ సమావేశం లో భారత ప్రధాని నరేంద్రమోదీ ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్‌ నిపుణులు, పలువురు మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గైర్హాజరయ్యారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పీయూష్‌ గోయల్‌, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. అయితే, కీలకమైన ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హాజరుకాకుండానే సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ‘‘ఆర్థికశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశం నిర్వహిస్తారా.? కనీసం వచ్చే సమావేశానికైనా ఆర్థిక మంత్రిని ఆహ్వానించే విషయంపై ఆలోచించండి’’ అని ట్విటర్‌ వేదికగా ఆరోపించింది. దీనికి ఫైండింగ్‌ నిర్మల పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్‌ పెట్టింది.

Related posts

ముస్లింల సమస్య తీర్చని హోమ్ మంత్రిని అడ్డుకుంటాం

Satyam NEWS

విజయనగరంలో సేవా భారతి అధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

రైతులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిన సిఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment