29.7 C
Hyderabad
May 2, 2024 05: 22 AM
Slider కృష్ణ

బస్ షెల్టర్ ను కూలగొట్టిన వైసీపీ గూండాలు

#rajendraprasad

ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన  రాజ్యాంగానికి బదులు పులివెందుల రౌడీ రాజ్యం, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో కట్టించడం కన్నా కూలగొట్టడం ఎక్కువగా జరుగుతోందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి స్థాయిలో పెద్ద పెద్ద నిర్మాణాలు కూలగొడుతుంటే వైసీపీ నాయకులు చిన్న చిన్న నిర్మాణాలు కూలగొడుతూ తమ వంతుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం, గొల్లగూడెం లో తేదేపా మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కృష్ణ బాబు, తేదేపా నాయకులు కట్టించిన బస్ షెల్టర్ ను వైసీపీ గూండాలు ధ్వంసం చేయడం చూస్తుంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతన్నదని ఆయన అన్నారు.

గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కట్టించిన బస్ షెల్టర్ ను ధ్వంసంచేయడం దారుణమని ఆయన అన్నారు. గొల్లగూడెం వెళ్లి ధ్వంసమైన బస్ షెల్టర్ ను బాబు రాజేంద్ర ప్రసాద్ పరిశీలించి ఆ ప్రదేశం నుంచే కంకిపాడు పోలీసు వారికి  ఫోన్ చేసి వెంటనే దుండగుల పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, గ్రామంలో నలుగురికీ ఉపయోగపడే బస్ షెల్టర్ ను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, గత మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తూ, నలుగురికి ఉపయోగ పడాల్సింది పోయి కక్షసాధింపు ధోరణి తో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నారని అన్నారు.

వైసీపీ చేసే ప్రతి పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళే తగిన బుద్ధి చెబుతారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా  కంకిపాడు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కృష్ణ బాబు, కంకిపాడు టౌన్ ప్రధాన కార్యదర్శి విక్రం, బాణావత్ నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

బిఆర్ ఎస్ కు తుమ్మల రాజీనామా

Bhavani

వైన్స్ షాపులకు దరఖాస్తు ప్రక్రియ షురూ

Bhavani

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ విడుదల

Satyam NEWS

Leave a Comment