రాష్ట్రంలో నీటి వనరుల వినియోగంపై ప్రభుత్వం నుంచీ పక్కా సమాచారం రావడం లేదని దీనిపై తక్షణం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేసారు. జన సంఘ్ వ్యవస్థాపకుడు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా విజయనగరంలోని ప్రేమ సమాజంలో అక్కడే ఉంటున్న వారికి పండ్లు పంపిణీ చేసారు.
అక్కడ నుంచీ పీఎస్ఆర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నీటివనరులవినియోగంపై స్పష్టత లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో అసలు ఎంత వెచ్చిస్తుందో ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు ఉన్నట్టు కనిపించడం లేదన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగాఈ వర్షాకాలంలో కోటిమొక్కల పెంపకమని చెప్పిందని…కాని ఏయే జిల్లకు ఎంతెంత కేటాయించారో చెప్పాలన్నారు.
వీటినన్నంటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేబినెట్ ర్యాంకు తోఉన్న వాటర్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబూరావు,పార్టీ అధ్యక్షురాలు రెడ్డిపావని,శివ ప్రసాద్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.