చిత్తూరు జిల్లా పలమనేరు లో పట్టపగలే టౌన్ సమీపంలో 15 ఏనుగుల గుంపు కదలాడటం ఆందోళన కలిగిస్తున్నది.
ఉదయం పలమనేరు టౌన్ లోని రాధా బంగ్లా వద్ద సుమారు 15 ఏనుగులు ఇళ్ల మధ్యలో నుంచి రోడ్డు దాటాయి.
ఇది చూసి ఒక్క సారిగా అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
అడవిలో నుంచి ఏనుగులు టౌన్ లోకి వస్తున్నాయని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.
ఇంత జరుగుతున్న అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. (వీడియో చూడండి)