నవంబర్ 1న కేరళ అందాల సుందరి, మాజీ మిస్ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్, మరో ఎడ్వర్టైసింగ్ ప్రొఫెషనల్ మొహమ్మద్ ఆషిక్ల మరణం యావత్ దక్షిణ భారత దేశంలో సంచలనంగా మారింది. నవంబర్ 1 తెల్లవారుజామున కొచ్చిలోని హోటల్ నంబర్18లో జరిగిన ఓ పార్టీకి అటెండ్ అయి వస్తుండగా జరిగిన ఈ రోడ్డు యాక్సిడెంట్ మొత్తం ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది.
స్పాట్లోనే కేరళ అందాల రాసులిద్దరినీ మృత్యువు కబళించింది. ఆ తరువాత అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ మొహమ్మద్ ఆషిక్ మరణించారు. అయితే దీన్ని అంతా ప్రమాదంగానే భావించారు. కానీ రోజులు గడిచేకొద్దీ అది నిజంగా ప్రమాదమేనా? లేక ఈ యాక్సిడెంట్ వెనుక ఏదైనా కుట్రకోణం దాగివుందా? అన్న అనుమానం అందర్నీ వెంటాడింది.
సరిగ్గా ఈ రోడ్డు ప్రమాదానికి గంట ముందు “ఇట్స్ టైమ్ టు గో” అనే కాప్షన్తో తన ఇన్స్ట్రాగ్రాంలో ఓ వీడియో అప్లోడ్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.