కేరళ లో ఓ విద్యార్థి కి కరోనా వ్యాధి ఉన్నట్టు వైద్యులు ధృవీకరించడంతో దేశంలోకి ఈ మహమ్మారి జొరబడ్డట్టు స్పష్టం అవుతున్నది. కేరళ కు చెందిన ఓ విద్యార్థి చైనా లోని వుహానా యూనివర్సిటీ లో చదువుతుంది. ఇటీవలే ఆ విద్యార్థి చైనా నుంచి తిరిగి వచ్చింది.
తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో అనుమానం వచ్చిన వైద్య లు ఆమె బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షించగా ఆమెకు కరోనా వైరెస్ ఉన్నట్టు గుర్తించారు. ఆ విద్యార్థి ని ఐసొలేషన్ లో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.