ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను విశాఖలో సీబీఐ రిజిస్టర్ చేసింది.
గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేవలం 17మందిపై మాత్రమే సీఐడీ కేసులు నమోదు చేసింది. సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
సీఐడీ నమోదు చేసిన కేసులను కూడా సీబీఐ పరిశీలించింది.