జ్యోతిర్లింగ క్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం కల్పించారు.
అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు మాత్రమే నిర్వహిస్తారు. ఆర్జిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం. గం. 6.30 లకు: రెండవ విడతను ఉదయం గం. 8.30లకు: మూడవ విడతను ఉదయం గం.11.30లకు: నాలగవవిడతను సాయంత్రం గం.6. 30లకు జరిపిస్తారు.
అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత హోమాల నిర్వహణ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం ఆలయ ప్రాంగణములో శాస్త్రోక్తంగా ఆకాశదీపం వెలిగిస్తారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు సాయంత్రం “పుష్కరిణి” వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కూడా నిర్వహించనున్నారు.
కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే పుష్కరిణి హారతికి భక్తులకు అనుమతిస్తారు. లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.