38.2 C
Hyderabad
April 29, 2024 13: 49 PM
Slider ప్రత్యేకం

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

#avinashreddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.

రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణ హాజరవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.

వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో కోర్టుకెళ్లిన ప్రతిసారీ సీబీఐ సంచలన విషయాలు వెల్లడిస్తోంది. అంతకుముందు విచారించిన సీబీఐ.. ఎంపీ అవినాష్‌పై రెండు నేరాలను మోపింది. ఒకటి వివేకా హత్య, రెండోది ఆధారాలను మాయం చేయడం.. ఈ రెండింటినీ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ క్రమంలోనే మళ్లీ నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం వరకు హైదరాబాద్ లో ఉన్న అవినాష్.. కడపవెళ్లారు.. తాజాగా నోటీసులు ఇవ్వడంతో మళ్లీ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు.

ఇప్పటికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ పలు మార్లు విచారించింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోసం పిటీషన్ వేయగా సీబీఐ కోర్టు దానిని సోమవారం కొట్టివేసింది.

Related posts

ముషీరాబాద్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంట్రాక్టర్

Satyam NEWS

భూమి ఎలా ఉందో చూపించిన చంద్రయాన్

Satyam NEWS

Leave a Comment