మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు నేడు మళ్లీ విచారణ ప్రారంభించారు.
ఈ కేసులో పలువురు అనుమానితులను సీబీఐ ఇప్పటికే విచారించింది.
ఈరోజు వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు.
గత ఏడాది విచారణ చేస్తున్న సమయంలో సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో వారు విచారణను తాత్కాలికంగా నిలిపేసి వెళ్లిపోయారు.
మళ్లీ నేటి నుంచి తిరిగి విచారణ ప్రారంభించారు.