40.2 C
Hyderabad
April 26, 2024 14: 36 PM
Slider విజయనగరం

కొత్త సీసీ రోడ్డు,కాల్వ‌లను ప్రారంభించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

#VijayanagaramMLA

గ‌త కాలంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రం.. పాత బ‌స్టాండ్ ప్రాంతంలో…రాజీవ్ స్టేడియం వ‌ద్ద ఉన్న‌స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌కు శాశ్వ‌తంగా స్థానిక ఎమ్మెల్యే కోల‌గట్ల వీర‌భ‌ద్రస్వామి… కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్డు,కాల్వ‌లను ప్రారంభించి…ప‌రిష్కారం చూపించారు.

దాదాపు 23 ల‌క్ష‌ల వ్య‌యంతో గౌడ వీధి,తెలక‌లం వీధి, పాత బ‌స్టాండ్ ,పుచ్చ‌ల వీధిల‌ను క‌లుపుతూ ఉన్న జంక్ష‌న్ కు సీసీ రోడ్డును వేయించి స్థానికుల వెత‌ల‌ను తీర్చారు. అలాగే అదే జంక్ష‌న్ వ‌ద్ద ఆ నాలుగు వీధుల‌ను క‌లుపుతూ..నిర్మించిన కొత్త కాల్వ ప‌నుల‌ను కూడా ఎమ్మెల్యే స్వామి ప్రారంభించారు.

క‌రోనా కాలంలో అంటే గ‌డ‌చిన 11 నెల‌ల నుంచీ స్థానికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని…స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని త‌మ దృష్టికి రావడంతో పాటు..మ‌ర‌మ్మ‌త్తులను పూర్తి చేయాల‌ని మున్సిప‌ల్ సిబ్బందిని ఆదేశించామ‌ని ఎమ్మెల్యే గుర్తు చేసారు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం న‌వ‌రత్నాలు ప‌థ‌కాల‌లో భాగంగా..ఒక్కో వాగ్దానాలు నెర‌వేర్చి..స‌మ‌ర్దుడైన సీఎంగా పేరు తెచ్చుకుంటున్నార‌ని ఎమ్మెల్యే స్వామి అన్నారు.త‌మ ప్ర‌భుత్వం పేద‌ల అభ్యున్న‌తికి కృషి చేస్తోంద‌ని తెలిపారు.

అంత‌కుముందు న‌గ‌ర వైఎస్ఆర్సీపీ అధ్య‌క్షుడు ఆశ‌పు వేణు మాట్లాడుతూ…గ‌త ప్ర‌భుత్విం నిలిపివేసిన ప‌నుల‌కు ఎమ్మెల్యే నిథులు కేటాంయించి.. అనుకున్న త‌డవు ప‌నులు పూర్తి చేస్తున్నార‌నేందుకు  ఈ ప్రారంభోత్సమే అందుకు ఉదాహ‌ర‌ణ అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్ఆర్సీపీ నేత రాజేష్, న‌డిపేన శ్రీనివాస‌రావు, పార్టీ  కార్య‌క‌ర్త‌లు,స్థానికులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: కరోనాను ఎవరూ ఆహ్వానించవద్దు

Satyam NEWS

తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా దుర్గాప్రసాద్

Satyam NEWS

ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ లో భారీగా చేరికలు

Satyam NEWS

Leave a Comment