జగన్ ప్రభుత్వ హయాంలో గడచిన రెండు న్పరేళ్లుగా కరోనా మూలంగా జరగలేని అభివృద్ధి కార్యక్రమాలు పనులు చకచకగా శంకుస్థాపన లతో మొదలయ్యాయి. తాజాగా విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 33 వ డివిజన్ మయూరీ జంక్షన్ నుంచీ శ్రీనివాస కాలేజీ వయా ఎస్పీ బంగ్లా రోడ్ విస్తరణకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి,, డిప్యూటీ మేయర్ శ్రావణి, 33వ డివిజన్ కార్పొరేటర్ రంగా తదితరులు ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 33 డివిజన్ కార్పొరేటర్ రంగా మాట్లాడుతూ నా డివిజన్ లో దాదాపు రెండు కోట్ల అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. ఆ మధ్య బాలాజీ నగర్ గిరిజన కార్పొరేషన్ నుంచీ టెంపుల్ వరకు మరమ్మతులకు గురైన రోడ్ బీ.టీ రోడ్ తో అభివృద్ధి పరిచామని చెప్పారు. తాజాగా మయూరీ జంక్షన్ నుంచీ శ్రీనివాస కాలేజీ వరకు 33లక్షల తో విస్తరణ పనులు చేపట్టామన్నారు. తన డివిజన్ లోనే దాదాపు 3 కోట్ల తో అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో వీఎంసీ డబ్బులు మంజూరు చేసిందని ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ రంగా తెలిపారు.