విజయనగరం ,పార్వతీ పురం రెండు జిల్లాల్లో గడచిన కొద్ది నెలల నుంచీ రెండు పులులు తిరుగుతున్నాయంటూ వార్తలు గుప్పుమనటం…అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అవటం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా… ఆ వార్తలను నిజం చేస్తూ…ఓ ఘటన వెలుగు చూసింది… అదీ పార్వతీ మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ బుచ్చింపేట గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. పులి దాడిలో మేక మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.అదీ గాక పులి తిరిగి మేకను చంపిన ఆనవాళ్లను కూడా చూపిస్తున్నారు.. ఆ ఊరి గ్రామస్తులు.దీంతో వైద్యులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు..గ్రామస్తులు.
డోకిశీల పంచాయతీ గ్రామస్తులకు స్థానికంగా ఉన్న జాంతికొండ పై పులి సంచరిస్తున్నట్లు స్థానికుల అనుమానంతో
పాదముద్రలు పరిశీలించారు అటవీశాఖ అధికారులు. అనంతరం పులి సంచరిస్తున్నట్లు నిర్థారణ చేసిన సాలూరు అటవీశాఖ అధికారులు.