జాతీయ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా కిలారి కొండప నాయుడు ని నియమించినట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వైభవ్ తివారి, ఉపాధ్యక్షులు సౌరబ్ సక్సేనా, ప్రధాన కార్యదర్శి అలోక్ దీక్షిత్, జాయింట్ సెక్రటరీ వినయ్ కుష్వాల్ తెలిపారు.
ఈ మేరకు ఆయన కు నియామక పత్రాన్ని అందజేశారు. విద్యా రంగం లో విస్తృత పరిచయాలున్న కిలారి కొండప నాయుడు ని ఈ పదవి కి ఎంపిక చేశామన్నారు.
కిలారి కొండప నాయుడు ప్రస్తుతం ఒంగోలు లోని నాగభైరవ నీట్ / ఐఐటీ అకాడమీ లో డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు.