26.7 C
Hyderabad
April 27, 2024 10: 46 AM
Slider తెలంగాణ

నో సెక్యూలర్:ఢిల్లీ ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారు

chada venkatreddy comment on bjp loss in delhi

నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఈ విధానాలు నచ్చకే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మంచిర్యాలలో సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లులో స్వాతంత్ర్యకాలం నుండి వున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు.

రూ.4 కోట్ల బడ్జెట్ ను జిఎస్టీ, ఇతర పన్నుల ద్వారా స్వీకరిస్తామనడం ప్రజల ముక్కు పిండి వసూలు చేయడమేనని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు శ్రీనివాస్ తో పాటు పలువురు సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఆరోగ్య ప్రదాయిని: హైదరాబాద్‌ లో నీరా కేఫ్ రెడీ

Satyam NEWS

కిటకిటలాడుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం

Bhavani

కామన్పవలస ఆశ్రమం లో సద్గురు ఆది శంకరుల జయంతి..!

Satyam NEWS

Leave a Comment