నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఈ విధానాలు నచ్చకే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మంచిర్యాలలో సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లులో స్వాతంత్ర్యకాలం నుండి వున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు.
రూ.4 కోట్ల బడ్జెట్ ను జిఎస్టీ, ఇతర పన్నుల ద్వారా స్వీకరిస్తామనడం ప్రజల ముక్కు పిండి వసూలు చేయడమేనని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు శ్రీనివాస్ తో పాటు పలువురు సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.