38.2 C
Hyderabad
April 28, 2024 19: 25 PM
Slider ప్రత్యేకం

మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం

#Telangana CM KCR 2

తెలంగాణ‌లో మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మిస్తూ సీఎం కేసీఆర్ బుధ‌వారం నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. తాజా నియామ‌కాల్లో విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ల‌కు చైర్మ‌న్లు నియ‌మితుల‌య్యారు.

తెలంగాణ విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా రావుల శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Related posts

రెండవ విడత పల్లె ప్రగతి విజయవంతం చేద్దాం

Satyam NEWS

దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బిజెపి…

Satyam NEWS

వాక్ ఫర్ ఎథిక్స్: యాదాద్రిలో నైతిక విలువల నడక

Satyam NEWS

Leave a Comment