38.2 C
Hyderabad
April 29, 2024 11: 59 AM
Slider రంగారెడ్డి

ఎస్సై పైకి కారు పోనిచ్చిన వారిపై కఠిన చర్యలు

si accedent

వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో వాహనాలను తనిఖీ చేస్తున్న నవాబ్‌పేట ఎస్సై కృష్ణను కారుతో వేగంగా ఢీకొట్టిన నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు టోలిచౌకికి చెందిన ఇమ్రాన్‌, అన్వర్‌, నవీద్‌, సమీర్‌లు అని వికారాబాద్‌ పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఘటనపై డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పందించారు.

మద్యం సేవించి వాహనం నడిపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, గాయపడిన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలియజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి, తమ విధి నిర్వహిస్తున్న పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎస్సై కృష్ణ కాలు విరగడంతో పాటు, పాదం నుజ్జునుజ్జయింది.

Related posts

సెటిల్ మెంట్: స్వామి చెప్పారు ప్రధాన అర్చకుడిని తీసుకున్నారు

Satyam NEWS

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చెయ్యాలి

Satyam NEWS

అవినీతిపరులను రక్షించేందుకు కేంద్రం మార్గదర్శకాలు

Satyam NEWS

Leave a Comment