వికారాబాద్ జిల్లా అనంతగిరిలో వాహనాలను తనిఖీ చేస్తున్న నవాబ్పేట ఎస్సై కృష్ణను కారుతో వేగంగా ఢీకొట్టిన నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు టోలిచౌకికి చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్లు అని వికారాబాద్ పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు.
మద్యం సేవించి వాహనం నడిపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, గాయపడిన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో తెలియజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి, తమ విధి నిర్వహిస్తున్న పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎస్సై కృష్ణ కాలు విరగడంతో పాటు, పాదం నుజ్జునుజ్జయింది.