24.7 C
Hyderabad
March 26, 2025 09: 35 AM
Slider రంగారెడ్డి

ఎస్సై పైకి కారు పోనిచ్చిన వారిపై కఠిన చర్యలు

si accedent

వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో వాహనాలను తనిఖీ చేస్తున్న నవాబ్‌పేట ఎస్సై కృష్ణను కారుతో వేగంగా ఢీకొట్టిన నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు టోలిచౌకికి చెందిన ఇమ్రాన్‌, అన్వర్‌, నవీద్‌, సమీర్‌లు అని వికారాబాద్‌ పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఘటనపై డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పందించారు.

మద్యం సేవించి వాహనం నడిపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, గాయపడిన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలియజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి, తమ విధి నిర్వహిస్తున్న పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎస్సై కృష్ణ కాలు విరగడంతో పాటు, పాదం నుజ్జునుజ్జయింది.

Related posts

విఆర్వోలు ఫినిష్… నెక్ట్స్ ఎంఆర్వోలా?ఎంపిడివోలా? సబ్ రిజిస్ట్రార్ లా?

Satyam NEWS

సిఎం సహాయనిధికి బ్రాహ్మణ సేవా సంస్థ విరాళం

Satyam NEWS

ములుగులో చురుకుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Satyam NEWS

Leave a Comment