సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ సమీపంలో DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు.
దగ్గుపాటి బాబురావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న DSR ట్రస్ట్ మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం టౌన్ SI 1 వెంకట్ రెడ్డి, టౌన్ 2 SI సుందరయ్య శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ వేసవి కాలంలో వివిధ గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ కి వేల సంఖ్యలో వివిధ పనులకై ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఈ సేవా కార్యక్రమం చేపట్టిందని అన్నారు.ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామల్ల మార్క్స్, నాపసాని శివ,మీసాల అంజయ్య, లచ్చి మల్ల నాగేశ్వరరావు,దగ్గుపాటి సత్యానందం,MK టీ స్టాల్ పచ్చిపాల ఉపేందర్, అలవాల నరేష్,గుండ్ల రాజేష్, జాగృతి మస్తాన్,ములకలపల్లి రాంబాబు, సోమ గాని ప్రదీప్,ములకలపల్లి నరసింహారావు,సూర్య,CH ప్రసాద్, వెంకన్న,S అబ్రహం,Lసైదులు,కోల్లపూడి పద్మ,కె. సౌజన్య,కె చందు,దగ్గుపాటి కవిత, కె. శ్రావణి,D.రాజేష్,డి.సూర్య రాణా, తదితరులు పాల్గొన్నారు.